మెదక్ : చేగుంట మండలంలో పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఇవాళ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వల్లూరు, ఉల్లి తిమ్మాయపల్లి గ్రామంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఫారమ్- 1 బీలను అందించారు. ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ భారతి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.