వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలం ఏకే తండా ,సూర్య తండాలో గల నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పత్తి చేలలోని సారా స్థావరాలపై దాడులు చేసి రెండు వందల లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. ఐదు లీటర్ల నాటుసార, 50 కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. సారా కాసున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.