హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు పుస్తకాల కిట్లను నేటి నుంచి రవీంద్రభారతి ప్రాంగణంలో పంపిణీ చేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్లు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతినిధులందరూ ముందుగానే ఇక్కడి నుంచి కిట్లను పొందవచ్చని తెలిపారు. తర్వాతి రోజుల్లో హోటళ్లలో ఉన్న సంఖ్య ఆధారంగా ఆ మేరకు కిట్లు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.