చెనై్న: తనకు శిక్ష ఖాయమైన తరు వాత వీకే శశికళా నటరాజన్ శరవే గంగా పావులు కదిపి, రెండు గంటల వ్యవధి లోనే ఎమ్మెల్యేలతో చర్చించి, అనూ హ్యంగా పళని స్వామిని తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. తనకు సీఎం పదవి దక్కు కున్నా ఫర్వాలేదు, పన్నీర్ సెల్వంకు మాత్రం అవకాశం దక్కకుండా చే యాలన్న కృత నిశ్చయంతో ఆమె ఈ నిర్ణయం తీసు కున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పళనిస్వామికి సైతం మంచి నేతగా, జయల లితకు విధేయుడిగా, సౌమ్యుడిగా పేరుంది. దీంతో ఆయ నైతేనే పార్టీ చీలే అవకాశాలు తక్కువని శశికళ నమ్మినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు ఉన్న అవకాశాలను మరింతగా తగ్గించే దిశగా ఆలోచిం చిన ఆమె, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం ఆయన్ను తొలగి స్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లొంగిపోయేం దుకు సమయం కూడా ఇవ్వరా?: పోలీసులపై శశికళ తీవ్ర ఆగ్రహంతనను అరెస్ట్ చేయాలని రిసార్టు వద్దకు వచ్చిన పోలీసు అధికారులపై శశికళ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిసార్టు బయట భారీగా పోలీసులు మోహరించిన తరువాత, ఓ అధికారి లోపలికి వెళ్లి లొంగిపోయే విషయంలో శశికళ అభిప్రాయాన్ని కోరగా, ఆమె కోపంతో విరుచుకుపడ్డట్టు సమాచారం. మహిళనని కూడా చూడకుండా ఇంత ఘోరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన ఆమె, లొంగిపోయేందుకు కోర్టు తనకు నాలుగు వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. తనకు కోర్టులో లొంగిపోయే హక్కు ఉందని, పోలీసులు అరెస్ట్ చేయా ల్సిన అవసరం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆమె, కనీసం కోర్టు తీర్పు కాపీ కూడా ఇంకా తనకు అందలేదని, ఇప్పుడే అరెస్టులేంటని విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. ఆమె వైఖరితో సదరు అధికారి బయటకు వచ్చి, ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి నుంచి తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది.