ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 11:09 AM

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుదివిడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉత్తర, మధ్య గుజరాత్ జిల్లాల్లోని 93 స్థానాల కు 851 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 2.22 కోట్ల మంది ఓటును వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 18న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. గాంధీనగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.డిప్యూటీ సిఎం నితిన్ పటేల్, కాంగ్రెస్‌కు చెందిన జీవాభాయ్ పటేల్‌తో మెహెసానాలో తలపడుతున్నారు. ఒకప్పుడు మోడీ ప్రాతినిధ్యం వహించిన మణినగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన శేతా భ్రంభట్ బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌ఎ సురేశ్ పటేల్  పోటీలో ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com