భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సోండా సెహోర్ జిల్లా సోండ అనే గ్రాయంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ఉన్న కారు బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.