ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోలకు భారీ ఎదురుదెబ్బ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 11:40 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఇల్లెందు, కొత్తగూడెం మధ్యనున్న టేకులపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్‌కౌంటర్లో చంద్ర పుల్లారెడ్డి దళానికి చెందిన 8 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సంపత్‌నగర్ - గంగారం మధ్యనున్న అటవీ ప్రాంతానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.


ఈ ఎన్‌కౌంటర్లో ఎనిమిది మంది చనిపోయారని తెలుస్తుండగా.. ఆరుగురు చనిపోయారని అధికారులు ధృవీకరించారు. మూడు మృతదేహాలను గుర్తించిన పోలీసులు, మిగతా వాటిని పరిశీలిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇల్లెందు ప్రాంతంలో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com