తిరుమల: తిరుమల శ్రీవారిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితెల సతీష్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్దం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం రంగనాయకుల మడపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి సట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దరి ధనుర్మాసం ముందు స్వామి వారిని దర్శించుకోవడం కోసం తిరుమల వచ్చానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఆ దేవదేవుణి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.