న్యూఢిల్లి : వివిధ ప్రభుత్వ పథకాలకు, సేవలకు ఆధార్ను అనుసంధానించడం తప్పనిసరి చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టనున్నది. ఆధార్ అనుసంధానానికి డిసెంబర్ 31వ తేదీని గడువుగా విధించిన ప్రభుత్వం తరువాత మరొక మూడు నెలలపాటు గడువును పొడిగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై నేడు విచారణ చేపట్టనున్నది.