భధ్రాద్రికొత్తగూడెం: బొగ్గు వ్యాగన్ లో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ లో చోటుచేసుకుంది. KTPS 5వ దశకు రుద్రంపూర్ నుండి వచ్చిన బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పోలీసులకు సమాచారం అందించారు.