ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమామాధవరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 04:29 PM

హైదరాబాద్: మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి ఇవాళ మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, సందీప్ రెడ్డి టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఉమామాధవరెడ్డితోపాటు ఆమె అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు రెండువేలమంది టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, కిశోర్, శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com