హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం పత్రిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి హరీష్రావు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కవులు, రచయితలు, కళాకారులు, సాహిత్యసంస్థలతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గొప్పదనం ఈ సభల ద్వారా ప్రపంచవ్యాప్తం కానుందన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి అద్భుతమైన సాహిత్యం వెలువడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యకారులు, రచయితలను ఈ సభలకు ఆహ్వానించినట్లు వెల్లడించారు.