హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ వ్యాపార సంస్థల నేమ్ బోర్డులను (నామఫలకాలు) తెలుగులో రాయించి ప్రదర్శించే విధంగా తగు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన నామఫలకాలను తెలుగులో ప్రముఖంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడంలో కృషిచేయాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో అన్ని సంస్థలతో నామఫలకాలను తెలుగులో రాయించేందుకు డిప్యూటి, జోనల్ కమిషనర్లు వెంటనే తగు చర్యలు చేపట్టాలని కమిషనర్ జనార్థన్రెడ్డి నేడు ఉత్తర్వులు జారీచేశారు.