జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా భూపాలపల్లిలోని గుడ్ మార్నింగ్ స్కూల్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళి, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, పులా రవిందర్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంపూర్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తర్వాత ప్రపంచ తెలుగు మహా సభల ప్రారంభం సందర్భంగా భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉత్సవాలను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రాజేశ్ నాయక్, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.