కామారెడ్డి: మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. బాన్సువాడలోని స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్లకు ఆయన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తుందన్నారు. ప్రభుత్వమే అధికారికంగా జరుపుతున్న పండుగ క్రిస్మస్ అని.. అందుకే ప్రతి ఏడాది క్రిస్మస్కు బట్టల పంపిణీ, విందు భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదల మనసులో దేవుడు ఉంటాడన్న మంత్రి.. రాజ్యం సుభిక్షంగా ఉండి.. సుపరిపాలన సాగాలంటే పేదల ఆశిర్వాదం అవసరమన్నారు. అందుకే పేదలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.