ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్రపోతున్న ఎన్నికల కమిషన్‌ : చిదంబరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 09:20 AM

 కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూలపై ప్రశ్నిస్తున్నారని, మరీ అదే పని చేసిన బిజెపి నాయకులను ఎందుకు వదిలేశారంటూ ఎన్నికల కమిషన్‌ను మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం గురువారం ప్రశ్నించారు. గుజరాత్‌ టివి ఛానళ్లకు బుధవారం రాహుల్‌ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎన్నికల ఉల్లంఘన చేశారంటూ ఎన్నికల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై చిదంబంరం స్పందిస్తూ ఉద్యోగంలో ఎన్నికల సంఘం నిద్రపోతుందని ఆరోపించారు. గుజరాత్‌లో బిజెపిని, వారి ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలను కోరుతూ ట్విట్‌ చేశారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, రైల్వే మంత్రి వేర్వేరు ఇంటర్వ్యూలో మాట్లాడారని చిదంబరం పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్‌ కమిషన్‌ వదిలేసి, కేవలం రాహుల్‌పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లో ప్రచారం అనంతరం ఇంటర్వ్యూ ఇవ్వడంపై అందరికి ఒకే విధమైన నియమాలు ఉంటాయని చిదంబరం తెలిపారు. ఎన్నికల రోజున మోడీ రోడ్డుపై ప్రదర్శించిన తీరు ఎన్నికల ఉల్లంఘన క్రింద వస్తుందని, అది ఎన్నికల ప్రచారమేనని, ఎన్నికల కమిషన్‌ అప్పుడేం చేస్తుందని చిదంబరం ప్రశ్నించారు. టివి చిత్రాలను చూస్తే బిజెపి, ప్రధాని చేసిన పూర్తిస్థాయి ప్రచారం అందులో కనిపిస్తుందని, అందులో సందేహపడనక్కర్లే దన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిలబడాలని మీడియాను కోరారు. బిజెపి వ్యూహాలను తిప్పికొట్టి, 22ఏళ్ళ గుజరాత్‌ ప్రభుత్వాన్ని మార్చడంపైనే ఓటర్లు ఆలోచించాలని కోరారు. మీ ఓటు శక్తిని తక్కువ అంచనా వేయకండి. ప్రతి ఓటు మార్పును తీసుకు వస్తుందని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా నరేంద్రమోడీపై పిటిషన్‌ను దాఖలు చేసింది. గుజరాత్‌ చివరి ఎన్నికల దశలో పరిశ్రమల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ పాల్గొని ప్రసంగించారని కాంగ్రెస్‌ ఆరోపించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com