హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి భాషాభిమానులు నగరానికి విచ్చేశారు. ముంబయి ఆంధ్రమహాసభ, బివండి తెలుగు సమాజ్ శిక్షణసంస్థ తరపున 150 మంది భాషాభిమానులు మహారాష్ట్ర నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే కేంద్రం నుంచి బస కేంద్రం వరకు భాషాభిమానులకు ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం చేసింది. అదేవిధంగా మాల్దీవులు, మలేషియా, సింగపూర్, మారిషస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, పోలాండ్, ఇంగ్లండ్, అమెరికా, కెనడా తదితర దేశాల నుంచి భాషాభిమానులు హైదరాబాద్కు చేరుకున్నారు.