నాగర్కర్నూల్: వ్యాపారి సుధాకర్రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు రాజేశ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ హత్యా ఘటన స్థలంలో రాజేశ్ను విచారించిన అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో 14రోజుల రిమాండ్కు రాజేశ్ను తరలించారు. ఏ2గా ఉన్న సుధాకర్రెడ్డి భార్య స్వాతి రిమాండ్ను ఈనెల 29వరకు పొడిగించడంతో మహబూబ్నగర్ జైలుకు పోలీసులు తరలించారు.