హైదరాబాద్: ప్రకృతి విపత్తులను ఆపే శక్తి మనకు లేదు అంటూ.. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న కురిసిన వడగళ్ల వానపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులను ఆపే శక్తి మనకు లేకపోయినా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.