హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1నుంచి ఫిబ్రవరి 15వరకు అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బాలికల కోసం తొలిసారి పాలిటెక్నిక్ నిర్వహిస్తుంది ఎగ్జిబిషన్ సొసైటీ మాత్రమేనని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రదర్శనకు హైదరాబాద్ పెట్టింది పేరని మంత్రి అన్నారు. ప్రదర్శన సందర్భంగా సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లను నియమించామన్నారు.