శంషాబాద్ ఎయిర్పోర్టులో 4 అంతర్జాతీయ విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. ఉత్తర భారతదేశంలో దట్టంగా పొగమంచు ఏర్పడడంతో 4 విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దించారు. జెడ్డా-లఖ్నవూ విమానం, సౌదీ అరేబియా-ఢిల్లి విమానం, దుబాయి-బంగ్లాదేశ్, సింగపూర్-ఢిల్లి విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగాయి.