హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ పైనా, ఆయన అభిమానులపైనా విమర్శలు గుప్పించారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్ అభిమానులు తనపై సామాజిక దాడి చేశారన్నారు. తనను మానసికంగా వేధించారని చెప్పారు. తన అభిమానులను నియంత్రించడంలో పవన్ కల్యాణ్ విఫలమయ్యారని కత్తి మహేష్ అన్నారు. తాను ఒక ఫిల్మ్ క్రిటిక్ నని తన ఒపీనియన్ తనకు ఉంటుందని, ఉందని ఆయన అన్నారు. కాగా కత్తి మహేష్ కు వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన అభిమానులనే అదుపులో పెట్టుకోలేని పవన్ కల్యాణ్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని కత్తి మహేష్ ప్రశ్నించారు.