హైదరాబాద్ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని అన్నారు. ప్రతి అమ్మాయిని చదివించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. షీ టీమ్స్తో అమ్మాయిలకు భద్రత కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.