సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సంభవించే ఎల్నినో రుతు పవనాల కాలంలో ఏర్పడకపోవచ్చు. ఎల్నినో వచ్చిందంటే వర్షాలు కురవవు. దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు రుతు పవనాల కాలం ఉంటుంది. ఈ సమయంలోనే 70 శాతం వర్షాలు కురుస్తాయి. జులై చివరి నాటికి ఎల్నినో ఏర్పడుతుందని, ఇది పంటలపై ప్రభావం చూపుతుందని తొలుత ఆస్ట్రేలియాకు చెందిన వాతావరణ విభాగం అంచనా వేసింది. భారత వాతావరణ విభాగంలోని సుదూర ప్రాంత అంచనాలను పరిశీలించే నిపుణులు మాత్రం ఆ ప్రమాదం లేదని చెబుతున్నారు. ఎల్నినో ఏడాది చివరిలో వచ్చే అవకాశం ఉందని, రుతు పవనాల కాలంలో ఏర్పడకపోవచ్చని చెబుతున్నారు. దీనిపై ఏప్రిల్, మే నెలల మధ్యలో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa