భారత భూభాగంలోకి ఎవరినీ చొచ్చుకురానీయమని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా శక్తివంతమైనది కావచ్చు కానీ భారత్ బలహీనమైనది మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర సరిహద్దులపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఉత్తర సరిహద్దుల వెంట చైనా దుడుకు చర్యలను అడ్డుకునే శక్తి దేశానికి ఉందని ఆయన అన్నారు.