యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగకు జనాలు ఊర్లకు పయనమయ్యారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద అర కిలో మీటరు మేర వాహనాలు నలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద పది గేట్లు తెరిచినా వాహనాల రద్దీ తగ్గలేదు.