ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24 గంటల కరెంట్‌పై హరీష్‌రావు కీలక సూచన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2018, 02:58 PM

ఎస్సారెస్పీ కింద వర్ధన్నపేట నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. పర్వతగిరి మండలంలో పర్యటించిన మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు. సాధారణ రీతిలో పనులు జరిగితే కాళేశ్వరం పూర్తికి పదేళ్లు పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల ఏడాది లోపే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానుంది. కాళేశ్వరం పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయని హరీష్‌రావు స్పష్టం చేశారు. రోళ్లకల్, కొనరెడ్డి, ఏనుగాల్లు చెరువుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 


24 గంటల కరెంట్‌పై హరీష్‌రావు కీలక సూచన


24 గంటల కరెంట్‌పై మంత్రి హరీష్‌రావు కీలక సూచన చేశారు. సాగుకు 24 గంటల విద్యుత్ కావాలా, వద్దా అనేది రైతుల ఇష్టమని మంత్రి చెప్పారు. అవసరం లేని చోట రైతులు తీర్మానం చేసుకుని అవసరమైనన్ని గంటలు తీసుకోవచ్చని సూచించారు. నిరంతర సరఫరా వద్దనుకుంటే గ్రామతీర్మానం చేయాలని మంత్రి హరీష్‌రావు రైతులకు సూచన చేశారు. తీర్మానాలను ఎమ్మెల్యేలకు అందజేస్తే 24 గంటలకు బదులు సరిపడా విద్యుత్ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com