విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపైగల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్లో ఉంటోన్న ఆంధ్రా ప్రాంతం వాసులు పెద్దఎత్తున తమ సొంతూళ్ళకు వెళ్తుండడంతో హైవే రహదారిపై రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే కృష్ణా జిల్లా కీసర దగ్గర నిన్న ఒక్క రోజే 20 వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు టోల్ ఫ్లాజాలో నమోదైంది. ఇప్పటికే లక్షల్లో వెళ్లినప్పటికీ ఇంకా మిగిలిన వారు ఆదివారం ఉదయం నుంచి వెళుతుండడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.