వరంగల్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పాటు సీఎం సహాయనిధి నుంచి పలువురు లబ్దిదారులకు అందిన సహాయాన్ని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఇవాళ స్వయంగా చెక్కులను అందజేశారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాషిపల్లి ఈశ్వరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందిన చెక్కును నేరుగా ఇంటివద్దకు వెళ్లి అందజేశారు. అదేవిధంగా చిన్నమడూరు గ్రామంలో నలుగురు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.