హైదరాబాద్: వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. లారీ అక్కడున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ దూసుకెళ్లవడంతో 4 ఆటోలు, 2 బైక్లు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.