మెదక్: త్వరలో గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ తూప్రాన్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రూ.కోటి వ్యయంతో ఆటిటోరియం ఏర్పాటు చేస్తామన్నారు.