వరంగల్: హైదరాబాద్ తరహాలో వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మొత్తం 12 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు. మెగా టెక్స్టైల్ పార్కుతో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదన్నారు. 74 కిలోమీటర్ల పొడవుతో వరంగల్కు ఔటర రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కాజీపేట ఆర్వోబీని 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నమని మంత్రి గుర్తు చేశారు. తర్వలోనే వరంగల్కు మరో మూడు ఐటీ ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు.