ఆధునీకరించిన కొత్తగూడ బొటానికల్ గార్డెన్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ ఆధునీకరించిన బొటానికల్ గార్డెన్ను ప్రారంభించారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్ను రూ.5 కోట్ల నిధులతో ఆధునీకరించారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, జిమ్ సౌకర్యాలను బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి జోగురామన్న, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, తదితరులు పాల్గొన్నారు.