నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ప్రచారహోరుతో దూసుకుపోతున్న టీఆర్ఎస్లో చేరికల జోరు కొత్త జోష్ నింపుతున్నది. తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగకూడదని గులాబీ గూటికి చేరుతున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో వడ్యాల్, కొండాపూర్ గ్రామాలకు చెందిన గంగపుత్రులు గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టగలదని, సమగ్ర అభివృద్దిని సాధించాలంటే కేసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. గంగపుత్రుల కోసం కేసిఆర్ తెచ్చిన నీలి విప్లవం వారి జీవితాల్ని సమూలంగా మార్చివేసిందని, ఇంకా మరింత అభివృద్దిని సాధించాలంటే టీఆర్ఎస్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపినిచ్చారు.