ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి జూపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 24, 2018, 08:59 AM

పాన్‌గల్ : తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో పాటు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని శాగాపూర్, మాధవరావుపల్లి, కిష్టాపూర్ తండాలలో పర్యటింటి రైతులతో మాట్లాడారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే పెండింగ్ కాలువలను పూర్తి చేయిస్తామని, రైతులు ఎలాంటి అనుమానాలను పెట్టుకోవద్దని సూచించారు. శ్రీశైలం డ్యాంలో నీరున్నంత వరకు సాగునీటికి ఢోకా లేదని, ఇక నుంచి రెండు పంటలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com