హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 12.15కు ఎల్బీనగర్-అమీర్పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. అమీర్పేట మెట్రో స్టేషన్లో గవర్నర్ నరసింహన్ కొత్త కారిడార్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కొత్త కారిడార్ ద్వారా 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం వాడకంలోకి రానుంది. అమీర్పేట-ఎల్బీనగర్ మధ్య ఉన్న 16 కిలోమీటర్ల కొత్త కారిడార్లో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.