హైదరాబాద్: హుస్సేన్సాగర్లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతున్నది. ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్ వద్ద గణనాథుల నిమజ్జనం జరుగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు హుస్సేన్ సాగర్లో 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. నిమజ్జనం ఆదివారమే ఉన్నప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో గణనాథులు తరలిరావడంతో నిమజ్జనం ప్రక్రియ ఇవాళ కూడా కొనసాగుతోంది.