డిసెంబర్ 15 నాటికి హైటెక్ సిటీ మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుందని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాదినాటికి పాత నగరానికి మెట్రో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. ఎంజిబిఎస్నుంచి ఫలక్నుమా వరకూ మెట్రో నిర్మాణం చేపడుతున్నామన్నరు. మెట్రో రెండవ ఫేజ్ను ప్రభుత్వమే నిర్మించనున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఎనిమిదిన్నర నిముషాలకు ఒక మెట్రో నడుస్తున్నదన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టునుంచి అన్ని వైపులకు మెట్రో సేవలు అందిస్తామని ఆయన చెప్పారు.