ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరుల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదు : శ్రావణ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 25, 2018, 05:18 PM

హైదరాబాద్ : అమరుల గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌లో ఎవరికీలేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు అమరుల పేరు ఎత్తితే వారి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఏ అమరుడు చెబితే మహేందర్‌రెడ్డి, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారని శ్రావణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మాది ప్రజల కూటమి… టీఆర్‌ఎస్‌ది దొంగల కూటమి’ అని దాసోజు శ్రావణ్‌ మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో సీపీఎం, టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని ఈ సందర్భంగా శ్రావణ్ గుర్తు చేశారు. ‘మీరు పొత్తు పెట్టుకుంటే నైతికం…. మేం పొత్తు పెట్టుకుంటే అనైతికమా? అని ఆయన ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com