హైదరాబాద్ : ఆన్ లైన్ లో డేటింగ్ సైట్ల పేరిట మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల పేరుతో రూ.లక్షలు కాజేసిన ఐదుగురు సభ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పశ్చిమబెంగాల్ కు చెందిన సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, 50 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ డేటింగ్ పేరుతో కేటుగాళ్లు కోట్లు కాజేశారని తెలిపారు. అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడించి కుర్రాళ్ల జేబులకు చిల్లులు వేస్తున్నట్లు తెలిపారు.