నిర్మల్ : బతుకమ్మ పేరిట ప్రభుత్వం వేలకోట్లు వృథా ఖర్చు చేసిందని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో తెలంగాణ జనసమితి పోరుసభ నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెజస అధినేత కోదండరామ్ పాల్గొని ప్రసంగించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు పునరాకృతి చేశారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆకృతిని స్వలాభం కోసమే మార్చారన్నారు. పనులన్నీ ఆంధ్ర గుత్తేదారులకు అప్పజెప్పి కోట్లు దండుకున్నారన్నారు.