హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరుగనున్నది. ఉదయం 11.30 గంటలకు జలసౌధలోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రెండురాష్ర్టాల అధికారులు హాజరుకానున్నారు. నీటి సంవత్సరం మొదలై ఐదునెలలు కావస్తున్నప్పటికీ బోర్డు తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. 300 టీఎంసీలకుపైగా రెండు రాష్ర్టాల మధ్య నీటి వినియోగం జరిగిన తర్వాత కృష్ణాజలాల పంపిణీపై బోర్డు దామాషాను తేల్చనున్నది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తెలంగాణ, ఏపీ ఇప్పటికే బోర్డుకు లేఖలు రాశాయి.