జగిత్యాల మండలం తాటిపెల్లి లో మధ్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. డిగ్రీ విద్యార్థులైన నవీన్, బొలిశెట్టి శ్రవణ్ లు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో నవీన్ మృతి చెందాడు. కాగా నవీన్ హత్యకు గల కారణాలు తెలియలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పరిశీలించారు. నవీన్ భౌతికకాయంపై కత్తిగాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. డీఎస్పీ వెంకటరమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రవణ్ ఆచూకి కోసం గాలిస్తున్నారు.