వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో విశ్రాంత వీఆర్వో మృతి చెందాడు. ట్రాక్టర్ రివర్స్ వస్తూ వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న విశ్రాంత వీఆర్వో శేఖర్ రెడ్డి(62) అక్కడిక్కడే మృతి చెందాడు.