ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గా పూజ సమయంలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 10:48 AM

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ సమయంలో వరుస పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు కుట్ర పన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ దుర్గాపూజ సమయంలో వరుస పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చమ బెంగాల్‌లోకి ప్రవేశించారని, ఉత్తర బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి, కూచ్‌బెహర్‌, సిలిగురి ప్రాంతాల్లో వారు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వారికి అవసరమైన పేలుడు సామగ్రి నేపాల్‌నుంచి సరఫరా అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. స్థానిక పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిఘా వర్గాలు కోరాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com