శబరిమల ఆలయం తలుపులు మరొక 24 గంటల్లో తెరచుకోనున్నాయి. ఆలయ సందర్శనకు వస్తున్న మహిళా భక్తులను బేస్ క్యాంపు వద్ద స్థానికులు నిలిపివేశారు. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళలో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తుతున్న కేరళలో నేడు కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగనున్నాయి. శబరిమల అంశంపై నేడు కేరళ మంత్రివర్గం భేటీ కానున్నది. అలాగే శబరిమల ఆలయం పూజారులు, హిందూ సంస్థల ప్రతినిధులు, ఆలయాన్ని నిర్మించిన రాజకుటుంబీకుల సభ్యులు నేడు సమావేశం కానున్నారు. సచివాలయం వద్ద యూత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరుగనున్నది. పాళయంనుంచి సచివాలయం వరకూ యాత్ర నిర్వహించనున్నారు. ఎల్డిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరుగనున్నాయి.