న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో.. ఓ వ్యక్తి చేతిలో పిస్తోల్తో హల్చల్ చేశాడు. అక్కడ ఉన్న ఓ జంటపై అతను చిందులేశాడు. హయత్ రీజెన్సీ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. హోటల్కు చెందిన అసిస్టెంట్ సెక్యూర్టీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిస్తోల్తో హల్చల్ చేసిన వ్యక్తిని ఓ మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే హోటల్లోని ఓ వాష్రూమ్ వద్ద ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పిస్తోల్తో బెదిరింపులకు పాల్పడిని వ్యక్తిని సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పట్టుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.