హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) రజత్కుమార్ నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా విడుదల, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, నగదు లావాదేవీలు, మద్యం సరఫరా నిఘాపై సిఇఒ వారితో చర్చించారు. దసరా తరువాత రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం రానుండటంతో ఎన్నికల ఏర్పాట్లపై నివేదిక సమర్పించడం తదితర అంశాలపై ఆయన కలెక్టర్లతో చర్చించారు.