మహబూబ్ నగర్ : కొడంగల్ ప్రజల అభిమానాన్ని ఏ రాజకీయ నాయకుడు కొనలేడని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోసిగి నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజల అభిమానాన్ని కేసీఆర్ జైలులో బంధించాలని చూస్తున్నారన్నారు. పట్నం ముఠాలు నన్ను ఓడించాలని చూస్తున్నాయన్నారు. ఎన్ని కోట్లు ఖర్చుచేసినా నా విజయాన్ని అడ్డుకోలేరన్నారు.