బెంగళూరు : బ్యాంకు మేనేజర్ను ఓ మహిళ చితకబాది.. చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనాగరిలో నిన్న చోటు చేసుకోగా ఇవాళ వెలుగు చూసింది. దేవనాగరికి చెందిన ఓ మహిళ.. లోన్(అప్పు) కోసం స్థానిక బ్యాంక్కు వెళ్లింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని బ్యాంక్ మేనేజర్ డిమాండ్ చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు మహిళ.. బ్యాంకు మేనేజర్ను నడి బజార్లోకి ఈడ్చుకొచ్చి.. కట్టెతో చితకబాది.. చెప్పుతో కొట్టింది. బ్యాంకు మేనేజర్ను మహిళ చితకబాదిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.